మాధురిని పరిచయం చేసింది నా భార్యే.. ఏం తప్పుచేశానని నాకీ శిక్ష?.. దువ్వాడ

కుటుంబ వివాదంపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. విలేకర్ల సమావేశం నిర్వహించిన దువ్వాడ శ్రీనివాస్.. కీలక వ్యాఖ్యలు చేశారు. తన భార్య వాణి అహంకారంతో వ్యవహరిస్తూ.. తనపై కూతుర్లకు ద్వేషం నూరిపోశారని ఆరోపించారు. ప్రతి ఇంట్లోనూ గొడవలు సహజమేనన్న దువ్వాడ శ్రీను.. వాటిని నాలుగు గోడల మధ్యనే పరిష్కరించుకోవాలన్నారు. వ్యాపారంతో పాటుగా రాజకీయాల్లో కూడా తానే ఉండాలని వాణి అహంకారంతో వ్యవహరించిందని.. కుమార్తెలకు తనపై ద్వేషం నింపిందన్నారు. వైఎస్ జగన్ తనకు టెక్కలి టికెట్ ప్రకటిస్తే.. తనకు కావాలని వాణి పట్టుబట్టిందన్నారు. విడాకులు కావాలని కూడా అడిగిందని విలేకర్ల సమావేశంలో చెప్పుకొచ్చారు. విషం తాగుతానని కూడా అప్పట్లో వాణి బెదిరించిందని దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు.

కుటుంబం కోసం వాణికి టికెట్ ఇవ్వాలని వైఎస్ జగన్‌ను అడిగానన్న దువ్వాడ.. దీంతోనే వైసీపీ అధిష్టానం మార్పు చేసిందన్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు వాణికి అనుకూలంగా లేకపోవటంతో తిరిగి తనకే టికెట్ కేటాయించారని దువ్వాడ చెప్పారు. టికెట్ తనకు ప్రకటించిన తర్వాత వాణి తనను ఇంట్లోకి రానివ్వలేదని.. తాళాలు వేసిందన్నారు. ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో వాణి తనను అనేక రకాలుగా వేధించిందన్న దువ్వాడ శ్రీనివాస్.. తన తల్లిని సైతం వాణి అనరాని మాటలు అనిందని చెప్పారు.

డ్యాన్స్ టీచర్ అయిన దివ్వెల మాధురిని తన భార్య వాణియే తనకు పరిచయం చేసిందని దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు. ఆ తర్వాత మాధురికి తనకు మధ్య లేనిపోనివి ప్రచారం చేశారని.. దీంతో దివ్వెల మాధురి ఆత్మహత్యకు కూడా ప్రయత్నించిందని వివరించారు. దాంతో తాను అండగా ఉంటానని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఎన్నికల సమయంలో కూడా మాధురి తన కోసం కష్టపడిందని.. రూ.2 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. తన భార్య తనను అమ్మకు దూరం చేసిందని,, సోదరులకు దూరం చేసిందని దువ్వాడ శ్రీను ఆరోపించారు.కుటుంబం కోసం టికెట్, వ్యాపారం, సంపాదన అన్నీ వదులుకుంటే ఏం తప్పు చేశానని నాకీ శిక్ష అంటూ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు.

ఇక త్వరలోనే తన భార్య వాణికి విడాకులు ఇస్తానని.. కుమార్తెల బాధ్యత తనదేనని దువ్వాడ శ్రీనివాస్ ప్రకటించారు. మరోవైపు తన రాజకీయ ప్రత్యర్థి అయిన అచ్చెన్నాయుడితో కలిసి వాణి తనను ఎన్నికల్లో ఓడించిందని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. తనకు ఏదైనా జరిగితే మంత్రి అచ్చెన్నాయుడు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *