Recent Posts

HYD నగరంలో అతిపెద్ద అండర్‌పాస్.. ఆ ఏరియాలోనే, ట్రాఫిక్ సమస్యకు చెక్

హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ది చెందుతోంది. ఇప్పటికే నగరం రూపరేఖలు మారిపోయాయి. కొత్త రహదారులు, ఫ్లైఓవర్లు, అండర్‌పాసులు అందుబాటులోకి వచ్చాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీటిని నిర్మిచంగా.. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం సైతం కొత్త ఫ్లైఓవర్లు, అండర్‌పాసుల నిర్మాణానికి సిద్ధమైంది. గ్రేటర్ పరిధిలోనే అతిపెద్ద అండర్‌పాస్‌ను నగరంలోని కేబీఆర్ పార్క్ సమీపంలో నిర్మిస్తున్నారు. పార్క్ చుట్టూ సిగ్నల్‌ ఫ్రీ ప్రయాణాలు సాగేలా ప్రభుత్వం ఈ అండర్‌పాస్‌లను అందుబాటులోకి తీసుకొస్తుంది. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ –45 వైపు నుంచి కేబీఆర్‌ పార్కు మెయిన్ గేటు వైపు దాదాపు …

Read More »

టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాకు సెమీస్ ఛాన్స్.. అదొక్కటే ఛాన్స్

ఆట ఏదైనా.. భారత్-పాకిస్థాన్ జట్లు ఎప్పటికీ దాయాదులే. కానీ మీరెప్పుడైనా అనుకున్నారా.. పాకిస్థాన్ క్రికెట్ జట్టు గెలవాలని భారత అభిమానులు కోరుకోవాల్సి వస్తుందని. కానీ వచ్చింది.. ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో తన చివరి లీగ్ దశ మ్యాచులో భారత్.. ఆస్ట్రేలియా చేతిలో 9 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో సెమీ ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. గ్రూప్-ఏలో ఉన్న భారత్.. ఇప్పటికీ సెమీ ఫైనల్ చేరేందుకు అవకాశం ఉంది. అదేలా అంటే.. ఈ గ్రూప్‌లో చివరి మ్యాచ్ …

Read More »

ముంబయి- న్యూయార్క్ విమానానికి బాంబు బెదిరింపు.. ఢిల్లీలో అత్యవసర ల్యాండింగ్

ముంబయి నుంచి న్యూయార్క్‌కు వెళ్తోన్న ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపుల రావడంతో దానిని న్యూఢిల్లీకి మళ్లించారు. సోమవారం ఉదయం ముంబయి నుంచి 239 మంది బయలుదేరిన ఎయిరిండియా విమానం.. న్యూఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దింపినట్టు అధికారులు తెలిపారు. ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్టు ఎయిరిండియా అధికార ప్రతినిధి వెల్లడించారు. విమానాన్ని ప్రత్యేకంగా ఓ రన్‌వేపై నిలిపి.. భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ‘‘ముంబయి నుంచి న్యూయార్క్‌లో జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయానికి అక్టోబరు 14న ఉదయం బయలుదేరిన …

Read More »